ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది.. తాజాగా పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.. కోడ్ అమల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదన్న సూచనలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం… ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పరిషత్ ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ.. హైకోర్టును ఆశ్రయించగా.. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు.. టీడీపీ పిటిషన్ను విచారణకు స్వీకరించింది.. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. అలాగే ఈ కేసులో ఈ నెల 15వ తేదీన అఫిడవిట్ దాఖలు ఎస్ఈసీని ఆదేశించింది హైకోర్టు. అయితే ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసుకున్న వేళ.. హైకోర్టు స్టే ఇవ్వడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారిపోయింది.
previous post
next post