telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం…

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం శ్రీ కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్ కు చేరుకున్నవి. ఇవాళ వాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం చేపట్టారు సీఎం. తదనంతరం, కొండపొచమ్మ సాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

ఇవాళ ఉదయం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లి కి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు చేరుకుంటాయి.

ఆ తర్వాత, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చే బర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి.

ఈ కార్య‌క్ర‌మాల్లో స్పీక‌ర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీ హ‌రీష్ రావు, శ్రీ వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీలు, శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, శ్రీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, శ్రీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శ్రీ శేరి సుభాష్ రెడ్డి, శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీ గంగాధర్ గౌడ్, శ్రీ ఫరీదుద్దీన్, శ్రీ ఫరూక్ హుసేన్, శ్రీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు శ్రీమతి ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, శ్రీ బాజిరెడ్డి గోవర్దన్, శ్రీ గణేష్ గుప్తా, శ్రీ హన్మంత్ షిండే, శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శ్రీ చిరుమర్తి లింగయ్య, శ్రీ సీహెచ్ మదన్ రెడ్డి, శ్రీ మహీపాల్ రెడ్డి, శ్రీ మాణిక్ రావు, సీఎం కార్యదర్శులు శ్రీమతి స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ప్రత్యేక పధాన కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ఈఎన్సీ శ్రీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ శ్రీ హరిరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వి. సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts