telugu navyamedia
రాజకీయ వార్తలు

విజయసాయిరెడ్డి నీచాతి నీచమైన వ్యక్తి : బుద్దా వెంకన్న

విజయసాయిరెడ్డి నీచాతి నీచమైన వ్యక్తి అని బుద్ధా వెంకన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా దోచుకోవాలో నేర్పి, ఆయనను జైలుకు పంపించిన ఘనత విజయసాయిరెడ్డిదేనని విమర్శించారు. సీఏగా విజయసాయిరెడ్డిని ఇన్‌స్టిట్యూట్‌ నుంచి తొలగించారని అన్నారు. తిరుమల శ్రీవారి వస్తువులపై విజయసాయిరెడ్డి కన్నుపడిందని ఆమన ఆరోపించారు. అందుకే శ్రీవారి వస్తువులు చేజారిపోయాయని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

జైలు జీవితంలో సహకరించాడని విజయసాయిరెడ్డికి జగన్‌ రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని ముంచుతారని, విజయసాయిరెడ్డి కాదు.. జైలుసాయిరెడ్డిగా మారిపోయారని బుద్ధా వెంకన్న అభివర్ణించారు. జగన్‌ లక్ష కోట్లు దోచుకోవడానికి దారి చూపిన వ్యక్తి విజయసాయిరెడ్డిని అన్నారు. మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ మట్టికరిచిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయసాయివల్ల జగన్‌కు నష్టమే తప్ప లాభం లేదని ఆయన అన్నారు.

Related posts