జమ్మూకశ్మీర్లోని షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్రీయరైఫిల్స్, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
హామీలు అమలు చేయడంలో మోదీ విఫలం: ఉత్తమ్