telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

kashmir encounter

జమ్మూకశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్రీయరైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున కూంబింగ్ చేపట్టారు.

ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి ఏకే-47, ఇన్‌సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Related posts