telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈ నెల 31 వరకు రాజస్థాన్ షట్‌డౌన్!

rjasthan corona

ఈ నెల 31 వరకు రాష్ట్రాన్ని షట్‌డౌన్ చేస్తున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ నిన్న ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. సీఎం ఆదేశాలతో నిన్న అర్ధరాత్రి నుంచే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర సేవలు తప్ప మాల్స్, షాపులు, ఇతర దుకాణాలు అన్నీ మూతపడ్డాయి.

షట్‌డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా ఆహార పొట్లాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హులందరికీ ఉచితంగా గోధుమలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాజస్థాన్‌లో శనివారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23కు పెరిగింది. కరోనా బాధితుల్లో నాలుగున్నరేళ్ల చిన్నారి ఉండడం గమనార్హం.

Related posts