telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మన్నత్’ను ప్లాస్టిక్ షీట్లతో కప్పించిన షారుఖ్… కారణం ఇదే…!!

Shah

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ముంబైలో ఉన్న తన భవంతి ‘మన్నత్’ను ప్లాస్టిక్ షీట్లతో కప్పించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి. సినిమా రంగంలో చాలా మందికి కరోనా సోకింది. ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ కరోనా వైరస్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ ప్లాస్టిక్ షీట్లతో తన భవంతి కప్పించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ అసలు కారణం ఏంటంటే… ప్రస్తుతం వర్షకాలం. ముంబైలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నుంచి తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఇలా ప్లాస్టిక్ షీట్లను కప్పించారు. కింగ్ ఖాన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలానే చేస్తున్నారు. కాగా, ‘మన్నత్’లో తన భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, అభ్‌రామ్‌తో కలిసి షారుఖ్ ఖాన్ ఉంటున్నారు. ఇక షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో సినిమాను అంగీకరించారు. ఇదొక సోషల్ మెసేజ్‌తో కూడిన కామెడీ డ్రామా. ‘వలసదారులు’ కాన్సెప్ట్ ఆధారంగా కథ నడుస్తుంది. ఈ సినిమాలో పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా షారుఖ్ కనిపించనున్నారు. పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లే వ్యక్తి పాత్రలో ఆయన నటించనున్నారు.

Related posts