telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా పాజిటివ్

Ravikrishna

ప్రభుత్వం సడలింపులతో కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ సీరియల్ పరిశ్రమ షూటింగ్ మొదలు పెట్టింది. కరోనా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పలువురు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్‌బాస్-3తో పాపులర్ అయిన రవికృష్ణ, కరోనా బారిన పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకి కరోనా సోకిందని తెలిపారు రవికృష్ణ. అయితే ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశాడు. తనతో కలిసి పని చేసిన వారిని పరీక్షించి ఆ తర్వాత ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని అభ్యర్ధించాడు రవికృష్ణ. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఎవరూ బయటకి రావొద్దని కోరుతున్నాడు. మొగలి రేకులు వంటి సీరియల్స్‌తో అనేక తెలుగు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ సినిమాల్లో కూడా అతడు నటిస్తున్నారు. ప్రస్తుతం పలు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు రవికృష్ణ. అయితే ఇటీవలే సీరియల్ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడి ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. అయిత నవ్య, రవికృష్ణ ఇద్దరు కలిసి ‘ఆమె కధ’ సీరియల్‌లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో వీరిద్దరూ ఇప్పుడు కరోనా బారిన పడటంతో.. మిగతా సీరియల్ యూనిట్ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీే సీరియల్ నటుడు పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రముఖ బుల్లితెర నటులైన ప్రభాకర్, రాజశేఖర్, నవ్య స్వామి, సాక్షి శివ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. మరోవైపు ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిలో నిజం లేదని ఒంకార్ ఖండించారు. కత్తి మహేష్‌కు కరోనా వచ్చిందని దుష్ప్రచారం జరిగింది. ఆయన కూడా ఈ వార్తలపై స్పందించింది అలాంటిదేం లేదని తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) on

Related posts