telugu navyamedia
రాజకీయ వార్తలు

మెట్రో నగరాల్లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు: గడ్కరీ

కోటికిపైగా జనాభా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల భద్రతకు సంబంధించి లోక్ సభలో కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ ప్రత్యేక బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ సహా అంతా మహిళా సిబ్బందే ఉంటారని, వాటిలో మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. కొత్తగా తయారు చేస్తున్న అన్ని బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరాలు తప్పనిసరి అని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు బస్సుల తయారీ సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Related posts