telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌ ఫాన్స్ కు షాక్ ఇచ్చిన కరోనా.. ఇవాళ్టి మ్యాచ్ వాయిదా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు అయితే తాజాగా ఐపీఎల్ సీజన్ 14 పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్ ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ బెంగుళూర్ జట్టు బ్లూ జెర్సీ తో బరిలోకి దిగేందుకు సమాయత్తం కాగా.. చివరి నిమిషంలో వైరస్ మ్యాచ్ కే అడ్డుపడింది. అయితే రద్దు అయిన ఈ మ్యాచ్ ను ఎప్పుడు నిర్వహిస్తారనేది బీసీసీఐ ఇక చెప్పాలదు. ప్రస్తుతం కోలకతా ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం.

Related posts