telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ : ఉప్పుడు బియ్యం సేకరణకు ఆమోదం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021-22 రబీ సీజన్ లో ఈ ధాన్యం సేకరణను జరపనన్నట్లు తెలిపింది.

ఇప్పటికే 6.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి సేకరించిన కేంద్ర ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల టన్నుల సేకరణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఉప్పుుడు బియ్యం సేకరణ సాఫీగా సాగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.

ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్ర నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కిషన్‌రెడ్డి ప్రకటనను విడుదల చేశారు.తుల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Related posts