telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన ఒవైసీ

Asaduddin mim

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా ఓ కొలిక్కి రానట్టు తెలుస్తోంది. సీఎం పదవీకాలాన్ని 50-50 (చెరి సగం) పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. తన పట్టును వీడడం లేదన్న విషయం తెలిసిందే. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

మహారాష్ట్ర ప్రజల కోసం బీజేపీ, శివసేన ఏదైనా చేయాలని అసదుద్దీన్ సూచించారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన సతారా ప్రజల గురించి ఆ పార్టీల నేతలు పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఆ పార్టీల నేతలు మాత్రం 50-50 గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. ’50-50 పేరిట మార్కెట్‌లో ఏదైనా కొత్త బిస్కెట్ వచ్చిందా?’ అంటూ ఒవైసీ ఎద్దేవా చేశారు.

Related posts