telugu navyamedia
రాజకీయ వార్తలు

దిశ చట్టంపై కేజ్రీవాల్ ప్రశంసలు

kejriwal on his campaign in ap

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ చట్టం బిల్లు ప్రతిని తనకు పంపించాలని లేఖలో కోరారు. ఇలాంటి చట్టాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. దిశ చట్టం ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

ఈ చట్టం ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపై 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన ఆధారాలు ఉంటే… 21 రోజుల్లో శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై తీవ్ర నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుంది.

Related posts