telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజా తీర్పు కోసం వేచిచూస్తున్నాం: కవిత

MP Kavitha comments BBP Govt.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత తమ అభిప్రాయాలను ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతోందనిఅన్నారు. ప్రజా తీర్పు కోసం వేచిచూస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ ఎంపీ స్థానంతోపాటు మొత్తం తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయి. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు. అని ట్వీట్‌ చేశారు. తనకు మద్దతుగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నిక ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు, ప్రజలకు మరో ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

Related posts