telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఈ ఏడాది వైద్యరంగంలో ముగ్గురిని వరించిన నోబెల్ పురస్కారం

Nobel

ఈ ఏడాదికి నోబెల్ పురస్కారం వైద్య రంగంలో ముగ్గురికి వరించడం విశేషం. హెపటైటస్-సి వైరస్‌పై పరిశోధనలకు గానూ హార్వే అల్టన్, మైఖేల్ హటన్, చార్లెస్ రైట్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రకటించారు. హార్వే అల్టన్, చార్లెస్ రైట్ అమెరికా పౌరులు కాగా.. మైఖేల్ హటన్ బ్రిటన్ పౌరుడు. అమెరికా బెథెస్డా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగంలో అల్టర్, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలో హౌటన్, రైస్ రాక్‌ఫెల్ యూనివర్సిటీలో చార్లెస్ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ మనీ సమానంగా అందజేయనున్నారు. వైద్యశాస్త్రంలో నోబెల్‌ను స్వీడన్‌కు చెందిన కరోలిస్కా ఇన్‌స్టిట్యూట్ అందజేస్తుంది.

ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం… ఆయన మరణించిన ఐదేళ్ల తర్వాత 1901లో ఈ పురస్కారాలను ప్రారంభించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అందజేస్తోంది. ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు… నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రదానం చేస్తారు. వైద్య రంగంలోనూ అల్ఫ్రెడ్ నోబెల్ పరిశోధనలపై ఆసక్తి ప్రదర్శించారు. కరోలినిస్కా ఇన్‌స్టిట్యూట్‌లో స్వీడన్ వైద్యుడు జోన్స్ జోహన్స్‌తో కలిసి పనిచేశారు. ఇదే సమయంలో ఫ్రాన్స్‌లోని ప్రముఖ ల్యాబొరేటరీలో పరిశోధనలు చేశారు. అందుకే వైద్య శాస్త్రంలోనూ నోబెల్‌ను అందజేస్తున్నారు. ఈ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద్ ఖురోనాకు 1968లో నోబెల్ బహుమతి వరించింది. కాగా నోబెల్ బహుమతులను తొలినాళ్లలో ప్రపంచ శాంతికి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం కోసం కృషి చేసిన మహానుభావులకు బహుకరించేవారు. 1969 నుంచి అర్ధశాస్త్రంలోనూ పురస్కారం అందజేస్తున్నారు.

Related posts