telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సరిహద్దుల్లో భారీ చొరబాటు కుట్రను భగ్నం చేసిన భారత ఆర్మీ…

indian army killed pak commando operation

సరిహద్దుల్లో భారీ చొరబాటు కుట్రను భగ్నం చేసింది భారత ఆర్మీ. పీఓకే సమీపంలోని కెరాన్‌ సెక్టార్‌ వద్ద దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నించారు. చలికాలంలో ఆర్మీ పహారా లేని మార్గాల గుండా ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే కెరన్ సెక్టార్ లోని కిషన్ గంగా నదిలో పాక్ నుంచి ఆయుధాలను ట్యూబ్ ల చేరవేసేందుకు సిద్దమవ్వగా వారిని గుర్తించింది ఇండియన్‌ ఆర్మీ. ట్యూబ్ లను స్వాధీనం చేసుకొని ఓపెన్ చేసి చూడగా అందులో 4 ఏకే 74, మ్యాగజైన్లు, 240 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. వాటిని ఆర్మీ స్వాధీనం చేసుకున్నది. పాక్ సరిహద్దు వెంబడి 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించేందుకు లాంచ్ ప్యాడ్ల వద్ద ఉన్నారని, ఇండియన్ ఆర్మీ అలర్ట్ కావడంతో వారు ఇండియాలోకి ప్రవేశించలేకపోతున్నారని ఆర్మీ అధికారులు చెప్తున్నారు.అయితే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు పాక్‌సైన్యం సహకారం అందిస్తోంది. టెర్రరిస్టుల చొరబాటు వీడియో విడుదల చేశాయి ఇండియన్‌ ఆర్మీ వర్గాలు.

Related posts