బాహుబలి చిత్రంలో భళ్ళాలదేవ పాత్రతో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా దగ్గుబాటి తెలుగులో “విరాట పర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు హౌస్ఫుల్ ఫ్రాంచైజ్లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. విరాటపర్వం అనే పిరియడ్ డ్రామా చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. సాయి పల్లవి ఇందులో కథానాయికగా నటిస్తుంది.అయితే ఒకవైపు నటుడిగా బిజీగా ఉన్నప్పటికి, నిర్మాతగాను తన అదృష్టం పరీక్షించుకోవాలని యోచిస్తున్నాడు రానా. రానా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించనున్నాడని, ఈ ఏడాది జనవరి నుండి జోరుగా ప్రచారం జరిగింది. కాని దీనిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. రాజ్ తరుణ్ హీరోగా తన సినిమా రూపొందనుందని, ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించనున్నాడని చెప్పుకొచ్చారు. హిందీలోను అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నాడని చెబుతున్నారు.
previous post