telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీలో రోడ్డెక్కిన బస్సులు..రాయితీలు వర్తించవు!

apsrtc bus

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సులకు నిన్నటి నుంచే ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. చార్జీలు పెంచకున్నప్పటికీ 50 శాతం మందితోనే ఈ బస్సులను నడపనున్నారు.

ప్రయాణికులు బస్సెక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యసేతు యాప్. ప్రతీ ప్రయాణికుడి వద్ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు.ఇక, ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండు నుంచి మరో బస్టాండుకు మాత్రమే నడుస్తాయి. ఈ బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు.

ఇక 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు తమ పేరు, ఫోన్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది.

Related posts