telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మహాకాళీ మందిర్ లో పోలీసులకు చిక్కిన వికాస్‌ దూబే !

vikas dubay

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన తెలిసిందే. అతడి కోసం యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ]పోలీసులు దూబే ఫొటోతో పోస్టర్లు అంటించారు. అతడిని పట్టిస్తే రూ.5 లక్షల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో అతడి గురించి మధ్యప్రదేశ్‌ ప్రజలకు కూడా తెలిసింది.

కాన్పూర్ లో ఎన్‌కౌంటర్‌ అనంతరం దూబే మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించి అక్కడి పలు ప్రాంతాల్లో ముఖానికి మాస్కు, నకిలీ గుర్తింపు కార్డుతో తిరుగుతున్నాడు. దూబేను గుర్తించింది ఉజ్జయిని మహాకాళీ ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అని అధికారులు తెలిపారు.దైవ దర్శనానికి ఉజ్జయిని మహాకాళీ మందిరానికి వికాస్‌ దూబే వచ్చిన సమయంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడిని గుర్తించారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు దూబేను పట్టుకున్నారు. తనను పట్టుకోగానే తాను వికాస్ దూబే అని ఆ గ్యాంగ్‌స్టర్‌ ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని పట్టుకోగానే కాసేపు వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. దూబేను పోలీస్ స్టేషన్‌లో కాకుండా రహస్య ప్రాంతంలో ఉంచి, ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Related posts