లాక్డౌన్ పొడిగింపు అంశంపై త్వరలో ప్రకటన వస్తుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా నియంత్రణలో ఉందని చెప్పారు. కరోనాను తరిమికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో కూడా కరోనా అదుపులో ఉందని ప్రకటించారు. ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు.
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 70శాతం మర్కజ్ నుంచి వచ్చినవేనని తెలిపారు. రెడ్జోన్, ఆరెంజ్ జోన్ ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దని కిషన్రెడ్డి సూచించారు. దేశంలో మందులు, వెంటిలేటర్స్ పరికరాలకు ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. దేశంలో ఏడాదికి సరిపడ ఆహార నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.