పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారనే కారణంతో నిన్న రాత్రి పోలీసు స్టేషన్లో పురుగు మందు తాగి లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో పోలీసులు అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. జోన్ పరిధిలో ఆసుపత్రి ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు యత్నిస్తుండగా.. దానికి అధికారులు అంగీకరించడం లేదు.