ఈరోజు ఏపి సిఎం చంద్రబాబు విజయనగరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 2,644 ఎకరాల్లో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 500 ఎకరాల్లో విమానాశ్రయ అనుబంధ సంస్థలు, 100 ఎకరాల్లో రెండు బ్లాకులుగా వాణిజ్య భవనాలను నిర్మించనున్నారు. మిగిలిన 2044 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుంది.
ఇందుకోసం రూ.2,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. కాగా, భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన తరువాత అక్కడ ఉన్న సండ్రీ రిసార్ట్ వద్ద ఏపీ సిఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సిఎం శంకుస్థాన చేస్తారు.
Live from the public meeting at Bhogapuram Mandal in @vzmgoap. https://t.co/L7aWjp7sDk
— N Chandrababu Naidu (@ncbn) February 14, 2019
వపన్ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్: షర్మిల