రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్తారు. తిరుపతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ