telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ బాబు తర్వాతి సినిమా ఆ దర్శకునితోనేనా…?

గత విడుదలైన సినిమాల్లో భీష్మా కూడా ఒకటి. ఈ సినిమాతోనే నితిన్ ఏడాది తీపి కబురుతో మొదలు పెట్టాడు. ఈ సినిమాతో హీరోనే కాకుండా దర్శకుడు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. బీష్మ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ దర్శకుడు తన మరో కథను ఇటీవల సూపర్ స్టార్ మహేష్‌కు వినిపించాడు. దానికి మహేష్ పచ్చజెండా ఊపాడట. కథ అమితంతగా నచ్చడంతో ఎటువంటి ఆలస్యం చేయకుండా ఓకే అన్నాడట. చెప్పిన లైన్ నాకు ఓకే మొత్తం స్క్రిప్ట్‌ తీసుకొని రమ్మని చెప్పాడట. దాంతో వెంకీ తన కొత్త కథకు స్క్రిప్ట్‌ను పూర్తి చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా సర్కారు వారి పాట సినిమాలో చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే వెంకీ-మహేష్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. అయితే ఈ సినిమాలో మహేష్ చేస్తాడన్నది ఇంకా అధికారిక ప్రకటన ఉంది. ఒకవేల స్క్రిప్ట్‌తో మహేష్‌ను ఆకట్టుకోలేక పోతే వెంకీ మరో హీరోను చూసుకోవాలల్సి వస్తుంది.

Related posts