ఏపీసీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు(తెలుగు వారికి) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాలలో ఆనందాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పింఛన్ పెంపు పేదలకు పెద్ద కానుక అని చంద్రబాబు తెలిపారు.
తెలుగు ప్రజలకు చంద్రబాబు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పారదర్శకంగా, నిస్వార్థంగా పనిచేయడం వల్లే జన్మభూమి కార్యక్రమంలో గొడవ చేయాలని కొందరు యత్నించినా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం