telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

పట్టణాలలో కూడా.. ‘నూరు’కే నల్లా..మిషన్ భగీరథ..

municipal water tap is just for 1 rupee

తెలంగాణాలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి దరఖాస్తు చేసుకోడానికి అటు పట్టణ వాసులు, ఇటు పల్లె వాసులు ధరలు చూసి వెనక్కితగ్గుతున్నారు. దీనితో ప్రభుత్వం ఈ ధరలను భారీగా తగ్గించేసింది. ఇప్పటికే పల్లెలలో రూపాయికే నల్లా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఇప్పుడు పట్టణాల్లో నల్లా కనెక్షన్‌ పొందేందుకు చెల్లించాల్సిన ధరావతు సొమ్మును ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ విధానాన్ని యథాతథంగా కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఇప్పటి వరకు పట్టణాల్లో ఏపీఎల్‌ కుటుంబాలు కనెక్షన్‌ పొందాలంటే రూ.6 వేల ధరావతు, ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి రూ.10,500లు చెల్లించాల్సి వస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలంతా శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రంలోని పురపాలికలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల గృహాలకు నల్లాలు బిగించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల గృహాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. ధరావతు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఇంటి యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో 6.7 లక్షల గృహాలకు కనెక్షన్లు అందుబాటులోలేవు. వీటికి తోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల గృహాలకు కనెక్షన్లు అందించాల్సి ఉంది. అన్నీ కలిపి పట్టణాల్లో పది లక్షల గృహాలకు ఇవ్వాల్సి ఉంది.

Related posts