telugu navyamedia
సినిమా వార్తలు

టిక్కెట్ల రేట్ల జీవో ను అమలు చేయండి: ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ల రేట్లను నిర్ణయిస్తూ తీసుకొచ్చిన జీవో 35 అమలు అంశంపై నిర్మాత, నట్టి కుమార్ వేసిన పిటిషన్ కు అనుకూలంగా అమరావతి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం జిల్లాలోని కొంతమంది థియేటర్ల యజమాన్యాలు 35 జీవో ను అమలుపరచకుండా… తమ ఇస్టా నుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారంటూ… దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని…తక్షణమే ఈ అన్యాయం, దోపిడీపై చర్యలు తీసుకోవాలంటూ నట్టికుమార్ అమరావతిలోని హైకోర్టును ఆశ్రయించారు .

35 రూపాయల టిక్కెట్లను కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని, ఈ బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎం.ఆర్. ఓ., ఆర్డీవో స్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకె క్కానని నట్టికుమార్ తెలిపారు . ఈ బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోందని ఆయన తన పిటిషన్ లో వివరించారు దీనిపై కోర్టులో వాదనలు జరిగాయని… సోమవారం హైకోర్టు, జీవో 35 ని అమలు పరచాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కి, అనకాపల్లి ఆర్డీవోకి మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని నట్టికుమార్ తెలిపారు.

Related posts