telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్

ap

కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50శాతం ప్రభుత్వ ఉద్యోగులు వారం పాటు ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సామాజిక దూరం పాటించడంలో భాగంగా 50-50 చొప్పున ఉద్యోగులు ఆల్టర్నేటీవ్‌ వారాలు విధుల నిర్వహణకు రావాలని సూచించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ మొదలుకొని కిందిస్థాయి వరకు ఆల్టర్నేట్ వారాలు పనిచేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఉద్యోగులను 50-50 శాతంగా విభజించాలని ఆదేశించారు. జిల్లాలో హెచ్ఓడీలు, జిల్లా ఆఫీసులు, ఆ కింది ఆఫీసులలో ఉద్యోగులను సైతం 2 సమాన గ్రూపులుగా చేసి ఆల్టర్నేట్ వారాలు పనిచేయించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Related posts