telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హోం క్వారంటైన్ లోవెంకయ్య..త్వరగా కోలుకోవాలని పవన్ ట్వీట్

pawan venkaiah

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వెంకయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. మన భారత దేశ – ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నానని పవన్ ట్వీట్ చేశారు.

మంగళవారం రొటీన్‌గా నిర్వహించిన పరీక్షల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకినట్టు తేలింది. ఆయనను హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ లో తెలియజేసింది.

Related posts