telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటు: బండి సంజయ్‌

BJP Bandi sanjay

గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.

రంజాన్ పండుగకు బిర్యానీ, కాజు, పిస్తాలు ప్రభుత్వం పంపించి, హిందువుల పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దిగిరావాలన్నారు. లేకుంటే హిందువులంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

Related posts