ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య కేసులో న్యాయం చేయాలంటూ.. ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్ను కలిశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చిన జగన్… 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు… ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు… వీలైనంత త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు తానే గాయాలు చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర ఆరోగ్య పరిస్థితిని బట్టి… అతణ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 161వ స్టేట్మెంట్గా దివ్య తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్కు అందజేశారు. మెడపై తీవ్ర గాయం కారణంగానే దివ్య చనిపోయినట్లు… పోలీసులకు అందిన పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. బలమైన గాయం, అధిక రక్తస్రావం వల్లే దివ్య ప్రాణాలు వదిలినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆమె కడుపులో రెండు అంగుళాల మేర కత్తిపోట్లు కూడా ఉన్నాయని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నట్లు సమాచారం. ఆమె చేతి మీద కూడా కత్తిగాట్లు గుర్తించారు. పోస్ట్మార్టం రిపోర్టుతో పాటు రెండ్రోజుల్లో RFSL రిపోర్ట్ రాగానే… నాగేంద్రను అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఛార్జ్షీట్ వేయనున్నారు. ఇన్స్టాగ్రామ్లో దివ్య పోస్ట్ చేసిన వీడియోను కూడా ఓ ఆధారంగా చేర్చనున్నారు.. పోలీసులు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలంటూ దివ్య తల్లిదండ్రులు… సీఎం జగన్కు వినతిపత్రం ఇచ్చారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
previous post