telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం.. ఏకంగా 10 మందికి పాజిటివ్

ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారు వీరు అనే తేడా లేకుండా అందరికి సోకుతుంది ఈ వైరస్. ప్రజలు అంతా దానికి స‌మాన‌మే అనే రీతితో పంజా విసురుతూనే ఉంది. ఈ వైరస్ అందరికీ సోకుతోంది. అయితే తాజాగా టీం ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది. “ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్ళు, నలుగురు పిల్లలకు పాజిటివ్ గా తేలింది పిల్లల వల్ల అందరికీ కరోనా సోకింది. అందుకే గతవారం ఓ పేడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి.” అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్ చేసింది. కాగా కరోనా నేపథ్యంలో ఇప్పటికే అశ్విన్ ఐపిఎల్ 2021 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Related posts