telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం: విజయశాంతి

vijayashanti rahul

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ట్విట్టర్ లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని, ఆయన తప్పా మరెవరూ పార్టీకి నాయకత్వం వహించలేరని ఆమె ఓ ట్వీట్ చేశారు.

“శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం. అయితే, పార్టీలో ప్రస్తుత పరిణామాలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. పటిష్ట నాయకత్వంతో పార్టీ ముందడుగు వేస్తుందని తెలిపారు. ఆ బాధ్యత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను” అని ఆమె వ్యాఖ్యానించారు.

Related posts