ఏపీ రాజధాని రైతులు కొనసాగిస్తున్న ఆందోళన పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సామాజిక దూరం పాటిస్తూ రాజధాని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
పాత కేసుల పేరుతో రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం తగదని అన్నారు. కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని అన్నారు. భూమి ఇచ్చిన రైతులు, భూమి లేని పేదల పట్ల సానుభూతి చూపాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.