telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లే..సోము ఘాటు వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అసలు వాళ్లకి ప్రాజెక్టుతో ఏం పని అని ప్రశ్నించారు. పోలవరాన్ని ప్రశ్నిస్తే… తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని.., రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరముందని సోము అన్నారు.

1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని.., విభజన తర్వాత భద్రాచలం ఆలయాన్ని‌,మరో రెండు మండలాలు‌ తెలంగాణకు ఇచ్చారని సోము అన్నారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు‌ నీరు ఇవ్వాలని‌ దివంగత సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పనులు చేపట్టారని.., దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

రాష్ట్ర విభజన పై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అప్పట్లో పోలవరం వద్దని వరంగల్ కు చెందిన ఓ టీడీపీ మహిళా నేత అన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇద్దరు నేతలు ఆమె మాటలను కనీసం ఖండించలేదని సోము వీర్రాజు గుర్తుచేశారు.

చంద్రబాబు ‘పోలవరం సోమవారం’ అని ఆర్భాటం చేశారు. పోలవరంను వ్యతిరేకిస్తే.. విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లే. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదు. పోలవరం ముంపు ప్రాంతాలలలో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తాం అంటున్నారు. వారంతా భద్రాచలం మీద ఆధార పడటం‌ వల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి? ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ తో లాలూచి పడి రోడ్డెక్కారా? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా? .

పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ పర్యటన తరువాత 15 రోజులకొకసారి రివ్యూ చేస్తున్నారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుంది. చంద్రబాబు అనేక అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏపీలో పరిణామాలను మా‌ జాతీయ నాయకత్వానికి వివరిస్తాం’’ అని సోము వీర్రాజు అన్నారు

పోలవరం విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని సోము విమర్శించారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బతిన్నారని గుర్తుచేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎపీ పర్యటన తరువాత 15 రోజులకొకసారి పోలవరంపై రివ్యూ చేస్తున్నారని.. లోయర్ కాఫర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు. పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రచారం చేసిన జగన్.. మూడేళ్లలో వాటిని ఎందుకు బయటపెట్టి చర్యలు తీసుకోలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుందన్న సోము.. ఏపీలో పరిణామాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్నారు.

ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. భవిష్యత్తులో జరగబోయే అంశాలను ఇప్పుడే చెప్పేస్తామని వ్యాఖ్యానించారు. సీఎం రమేష్ మరో ఏక్ నాథ్ షిండే అని కేశినేని అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించాలని సోము వీర్రాజును విలేకరులు కోరారు. దీనిపై స్పందిస్తూ.. ‘‘ఎప్పుడో జరిగే అంశాలపై ఇప్పుడు మాట్లాడను. భవిష్యత్ లో జరిగే పరిణామాలను ఇప్పుడే ఎందుకు చెప్తాం.’’ అని అన్నారు.

Related posts