గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కొంత మండి వైసీపీ నేతలు ప్రభుత్వ అధికారుల వల్ల రాజీనామా చేయడం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు వంశీకి చంద్రబాబు తిరిగి లేఖ రాశారు. ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి పోరాడాలని సూచించారు. మీపై పెట్టిన కేసు దురుద్దేశంతో కూడినదని చెప్పారు. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదన్నారు. రాజకీయాలకు రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.
ప్రజలలో అవగాహన కలిగించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను ప్రస్తుత ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేధిస్తోందన్నారు. ఈ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొంటామని చంద్రబాబు చెప్పారు. పార్టీ తరపున మేము మీకు అండగా నిలబడతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.