telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్‌పై లోకేష్‌ ఫైర్‌… అధికారం వచ్చాకా కోతలంటూ

Lokesh Tdp

జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ తుంగలో తొక్కిందన్నారు. “మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా? బడుగు,బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా సీఎం జగన్‌ గారు?ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారు. ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం.ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్ రెడ్డి గారు. ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలి.ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చెయ్యాలి. ” అని లోకేష్‌ ట్విట్‌ చేశారు.

Related posts