ప్రభుత్వాలు నిర్భయ, దిశ, లాంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చిన దుర్మార్గులను కట్టడి చేయలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలు తాగిన పసిపాపలు నుంచి పెళ్ళైన మహిళలు, టీనేజ్ పిల్లలు వయసుతో సంబంధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. ముంబైలో సభ్య సమాజం తలదించుకునేలా ..ఓ మహిళపై దుండగులు అతి దారుణం సామూహిక అత్యాచారం చేసి.. శారీరకంగా చిత్రవధకు గురిచేశారు.
ఆ మహిళపై పాశవికంగా అఘాయిత్యానికి తెగబడిన దుండగులు ఆమె ప్రవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ముంబై మహానగరంలోని సకినాక ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మరో ‘నిర్భయ’ను తలపించింది.
ఈ ఘటన ముంబైలోని సకినాక ప్రాంతంలోని ఖైరాని రోడ్డులో జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బ32 ఏళ్ల బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరికొందరు నిందితుల కోసం ఆరా తీస్తున్నామన్నారు.