మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైన ప్రమాదం జరిగింది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బైక్పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బైక్ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్ తేజ్కు వైద్యులు స్కాన్ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు.
నో … స్పందించను..!