telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మళ్ళీ నిత్యానంద .. రాసలీలలు.. సామజిక మీడియాలో వీడియో వైరల్..

another viral video on nityananda

ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న నిత్యానంద మరో రాసలీల వీడియో బయటకి వచ్చింది. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ బిజినెస్‌ను పెంచుకుంటున్నాడు. ఇండియాతోపాటూ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో డొనేషన్లు ఇస్తూ అతన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావడం నిత్యానంద ఆశ్రమానికి వెళ్లడం, ఆయన చెప్పింది వినడం ఆ తర్వాత ఆయన భక్తులుగా మారిపోయి అన్నీ సమర్పించుకోవడం సహజమైపోతోంది. ఇటీవల నిత్యానంద ఆశ్రమ సిబ్బంది యువతుల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు చేసిన ఘనకార్యాలు వెలుగులోకి రావడంతో ఒకప్పటి నిత్యానంద భక్తులు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో… నిత్యానంద చెప్పిన మాటలు విని… ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ నిత్యానంద ఏం స్పీచాడన్నదేగా మీ డౌట్. ఇలా అన్నాడు. నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు. ఏ స్టూపిడ్ కోర్టూ నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు. నేను పరమశివుడిని. నేను నిజం చెప్పగలను. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలనని తన ముందు ఉన్న అనుచరులతో నిత్యానంద మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యింది.

Related posts