మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్టీటీవీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధిక రాయ్లను ముంబై విమానాశ్రయంలో సీబీఐ అడ్డుకుంది. వారం రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ సీబీఐ వారిని అధికారులు అడ్డుకున్నారు. ప్రణయ్ రాయ్ దంపతులు, ఈ నెల 15న తిరిగి భారత్ కు రావడానికి రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ వారిని అడ్డుకోవడం దారుణమని ఎన్డీటీవీ ఓ ప్రకటనలో పేర్కొంది.
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణయ్ రాయ్ దంపతులపై జూన్లో సెబీ నిషేధం విధించింది. రెండేళ్లపాటు ప్రణయ్ రాయ్ దంపతులతోపాటు హోల్డింగ్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. అలాగే, ఈ సమయంలో బోర్డు పదవితో ఉన్నత ఉద్యోగాలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయంలో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించలేదని, అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని సెబీ పేర్కొంది.
ప్రపంచ కప్ గెలవకపోతే… తాను నిరాశకు గురవుతా: అజార్