బాలీవుడ్ నటులు అంకితా లోఖండే- విక్కీజైన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు . ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే. గత కొద్ది రోజులుగా విక్కీ జైన్తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ మంగళవారం ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు.
పెళ్లికూతురు అంకిత గోల్డెన్ కలర్ లెహెంగాలో ముస్తాబవగా, వరుడు విక్కీ కూడా వధువుకు మ్యాచ్ అయ్యేలా బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వధూవరులిద్దూ పెళ్లి మండపం వద్దకు వింటేజ్ కారులో వచ్చి అందరిని ఆకర్షించారు. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం డిసెంబర్ 14 ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంకిత తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇండోర్లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు ‘టాలెంట్ హంట్’ రియాలిటీ షోలో పాల్గొంది. ఆ తరువాత దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి అంకిత నటించిన ‘పవిత్ర రిష్తా’ ధారావాహిక బాలీవుడ్ బుల్లితెరపై ఓ సంచలనం కావడంతో ఆమెకి గుర్తింపు వచ్చింది.
ఈ సీరియల్ చిత్రీకరణ సమయంలోనే సుశాంత్- అంకితలు ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్లపాటు ఈ ప్రేమ బంధం కొనసాగింది. కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణిక’తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత ‘బాఘీ 3’ చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత సుశాంత్తో వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుండి బాలీవుడ్ నటుడు విక్కీజైన్తో ప్రేమలో ఉంది అంకిత.
వేణుమాధవ్ పై హైపర్ ఆది వ్యాఖ్యలు