telugu navyamedia
సినిమా వార్తలు

వేణుమాధవ్ పై హైపర్ ఆది వ్యాఖ్యలు

Hyper-Adi

నిన్న అనారోగ్యంతో మృతి చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ అంతిమ యాత్ర మొదలైంది. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్‌ను అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్‌ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఛాంబర్‌లో వేణుమాధవ్ పార్థివ దేహానికి ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన అంత్యక్రియలకు ఇండస్ట్రీ అంతా తరలివచ్చింది. ఆయనతో తమ అనుబంధం గురించి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. అందులో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఉన్నాడు. తాజాగా ఈయన కడసారి చూపుకు వచ్చిన ఆది.. వేణు మాధవ్‌తో తనకున్న అనుబంధం గురించి మీడియాతో పంచుకున్నాడు. తనకు వేణు అన్న ఎప్పట్నుంచో పరిచయమని.. మేమంతా జబర్దస్త్‌లో బాగా నవ్విస్తున్నామని ఫోన్ చేసి చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడని చెప్పాడు ఆది. తనతో పాటు అందర్నీ బాగా చేస్తున్నారంటూ ప్రోత్సహించేవాడని, జబర్దస్త్ జడ్జి నాగబాబుతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన కోసం సెట్‌కు వచ్చిన ప్రతీసారి తమను కూడా కలిసి అందరితో మాట్లాడి వెళ్లేవాడని చెప్పాడు ఆది. నాలుగు రోజుల కింద కూడా తనకు వేణు అన్న ఫోన్ చేసి.. తమ చుట్టాలబ్బాయి ఒకర్ని జబర్దస్త్‌లో ఎలాగోలా ఇరికించాలంటూ కోరాడని చెప్పాడు ఆది. అలాంటి మంచి వ్యక్తి ఇంత చిన్న వయసులో పోవడం అనేది జీర్ణించుకోలేని విషయం అని చెప్పాడు జబర్దస్త్ కమెడియన్. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని చెప్పాడు ఆది.

Related posts