ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులకు తాత్కాలికంగా మంగళం పాడినట్టే. చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం నంది అవార్డులను తాము ఇస్తామని ప్రకటించింది. .2012, 2013 , 2014, 2015, 2016, సంవత్సరాలకు కమిటీలను వేసి అవార్డు విజేతలను కూడా కటించారు . 2012, 2013 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోకి నిర్మించిన సినిమాలు కానీ తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ నుంచి మాత్రమే అవార్డులు ఇస్తామని ప్రకటించింది .
ఆ రెండు సంవత్సరాలకు నిర్మాతలు అవార్డుల కోసం అప్లై చేసుకున్నాడు . కనీసం తెలంగాణ ప్రభుత్వం కమిటీలు కూడా వెయ్యలేదు . ఈ విషయంలో ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర్ రావు ను కానీ , తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు రామ మోహన్ రావు ను అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు .
మొదటి నుంచి సినిమా రంగంతో వున్న అనుబంధంతో చంద్రబాబు నాయుడు 2012 నుంచి 2016 వరకు అవార్డుల కమిటీలు వేశారు . ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది . ఈ అవార్డులు పక్షపాతంగా వున్నాయనే విమర్శలు వచ్చాయి. టీవీ చానెల్స్ లో నందుల గురించి రచ్చ చేశారు . దీంతో చంద్ర బాబు నాయుడు నంది అవార్డుల పేరెత్తితే మండిపోవడం మొదలు పెట్టాడు .
ఎప్పటికప్పుడు నంది అవార్డుల కార్యక్రమం ఉంటుందని విజేతలు ఆశాభావముతో వున్నారు . సినిమాతో పాటు టీవీ నంది అవార్డులు కూడా 2014, 2015, 2016 సంవత్సరాలకు ప్రదానం చెయ్యాలి . వాటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు . ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి ఇక నందుల కార్యక్రమం ఉండదు .
ఇదే విషయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్ధ అధ్యక్షులు అంబికా కృష్ణ ప్రస్తావించినప్పుడు , ” వచ్చేది మళ్ళీ తెలుగు దేశం ప్రభుత్వమేగా , అప్పుడు ఇస్తాం ” అని హామీ ఇచ్చాడు .
పొట్టి బట్టలు వేసుకున్నందుకు ట్రోల్ చేశారు : అవికా గోర్