కరోనా నేపథ్యంలో డిజిటల్ రంగానికి ఎంతగా డిమాండ్ పెరిగిందో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం కొత్త ఆలోచనల్లో పడ్డారని తెలుస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. మరోవైపు ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరుగుతోంది. ఇదంతా గమనించిన రామ్ చరణ్ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టబోతున్నారట. మెగాస్టార్ నట వారసత్వం పుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన చెర్రీ.. నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ సినిమాలు రూపొందిస్తున్నారు. అయితే తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఆయన డిజిటల్ రంగంలోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే పలువురు నటీనటులు, నిర్మాతలు డిజిటల్ కంటెంట్ డెవలప్ చేయడంలో ఆసక్తి కనబరుస్తున్న క్రమంలో చెర్రీ కూడా ఆ బాటలో వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ మేరకు అతిత్వరలో ఓ భారీ వెబ్ సిరీస్ నిర్మించేలా రామ్ చరణ్ అడుగులేస్తున్నారట. మరి ఈ విషయమై రామ్ చరణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమాలే… సమీరా రెడ్డి