సినిమాటోగ్రఫర్గా బాలీవుడ్లో కూడా చక్రం తిప్పి ఆ తర్వాత “చిత్రం” సినిమాతో దర్శకుడిగా మారి “నువ్వు నేను, జయం” అంటూ సంచలనాలు సృష్టించాడు. 15 ఏళ్ల పాటు విజయం కోసం చూసి “నేనే రాజు నేనే మంత్రి” అంటూ మరో విజయం అందుకున్నాడు ఈయన. తాజాగా ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన శివ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ చిత్రానికి తేజ అసిస్టెంట్ డైరెక్టర్గానే కాకుండా అసిస్టెంట్ కెమెరా మెన్గానూ వర్క్ చేసాడు. ఇక ఆ సందర్భంలో తనకు ఎదురైన ఆసక్తికరమైన సంఘటనల గురించి చెప్పాడు తేజ. ఈ చిత్రంలో ఉన్న రౌడీలు నిజంగానే రౌడీలని.. వాళ్ళు న్యాచురల్ యాక్టర్స్ అని చెప్పాడు తేజ. రోజుకు తమకు 10 మంది కావాల్సిన టైమ్లో ఏదో ఓ గొడవలో వాళ్లు పోలీస్ స్టేషన్లో ఉండటం.. తాను వెళ్లి బెయిల్ మీద విడిపించుకురావడం అలవాటైపోయిందని చెప్పాడు తేజ. ఓ సారి లెన్స్లోకి కొట్టమని కెమెరా మెన్ గోపాల్ రెడ్డి చెబితే అక్కడున్న రౌడీ నేరుగా కెమెరాకు కొట్టాడని, అప్పుడు పెద్ద గొడవ అయిపోయిందని చెప్పాడు తేజ. ఆ తర్వాత గొర్రెలు మేపుకునే వాళ్లను తీసుకొచ్చి తాము లైట్ మెన్స్ చేసామని.. వాళ్లతోనే సినిమా అంతా పూర్తి చేసామని చెప్పాడు తేజ. శివ సమయంలో తాము చాలా కష్టాలు పడ్డామని.. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో రౌడీలు, గొర్రెల కాపర్ల కృషి కూడా ఉందని చెప్పాడు తేజ. మొత్తానికి ఈ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలనే బయటపెట్టాడు ఈ దర్శకుడు.
previous post