telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్…

corona

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం 2618 కేసులు నమోదు కాగా, కొత్త కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 2849 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,836 కి చేరింది. ఇందులో 7,99,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21,672 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,734 కి చేరింది. ఇక ఏపీలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 142, చిత్తూరులో 436, తూర్పు గోదావరిలో 394, గుంటూరులో 277, కడపలో 169, కృష్ణాలో 421, కర్నూలులో 35, నెల్లూరులో 93, ప్రకాశంలో 185, శ్రీకాకుళంలో 88, విశాఖపట్నంలో 145, విజయనగరంలో 78, పశ్చిమ గోదావరిలో 386 కేసులు నమోదయ్యాయి.

Related posts