telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అధికార పార్టీకి ఓట్లు వేస్తేనే అభివృద్ధి: కేటీఆర్

ktr trs president

అధికార పార్టీకి ఓట్లు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దేశం అబ్బుర పడేలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. బీడు భూములకు గోదావరి జలాలు చేరాయని చెప్పారు. కంటి వెలుగు, ఆసరా, ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, రైతుబీమా, రైతుబంధులాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలు జరిగే రోజున తాను ఇండియాలో ఉండనని.. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తున్నానని తెలిపారు. చివరి రోజుల్లో ఆగం చేస్తారని… ఎవరూ ఆగం కాకుండా టీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని కోరారు. మున్సిపాలిటీలకు ప్రతి నెల రూ. 216 కోట్లు ఇస్తామని చెప్పారు.టీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు.

Related posts