ఇంగ్లండ్తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో భారత్ 8 పరుగులతో విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సెకండ్ టీ20తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సూర్య.. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్లతో బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (12) ఆరంభంలోనే ఔటవ్వగా.. విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తాడని అంతా ఊహించారు. కానీ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా బరిలోకి దిగాడు. మ్యాచ్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్స్గా మలిచిన సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ (1) ఆదిల్ రషీద్ బౌలింగ్లో భారీ షాట్ కోసం స్టెప్ ఔటై స్టంపౌట్గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ వేదికగా… ‘విరాట్ కోహ్లీని లీడర్గా నేను గౌరవించడానికి కారణం ఇదే. కొత్తగా భారత్ జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్కు అవకాశం ఇవ్వడం కోసం తన ఫేవరెట్ బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు’అని ఈ భారత మాజీ ఆల్రౌండర్ ట్వీట్ చేశాడు.
previous post
next post