telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు తెలంగాణ కేబినేట్‌ సమావేశం..వీటిపైనే చర్చ

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలపై తెలంగాణ కేబినెట్‌ ప్రధానంగా దృష్టిసారించనుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కేసీఆర్‌ తొలిసారి మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. దీంతో.. ఈ భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో కేసీఆర్‌ చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రభావం తగ్గిన నియోజకవర్గంలో ఎలా ముందుకు పోవాలనే అంశంపై కూడా కేసీఆర్‌ చర్చించనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు… ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. 

Related posts