దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొదగించిన నేపథ్యంలో నేడు కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. సాయంత్రం 5.30గంటలకు ప్రధాని నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ముఖ్యంగా కరోనా వైరస్ గురించే ఈ సమవేశంలో కీలక చర్చ జరగనుంది.
లాక్డౌన్ పొడిగింపు, దాని కారణంగా వివిధ రంగాలపై పడుతున్న ప్రభావం మొదలైన అంశాలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ పొడగింపుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలతో పాటు ప్రత్యేక ప్యాకేజీపై చర్చించే అవకాశముంది.
నాలుగు రాజధానుల విషయం నాకు తెలియదు: బొత్స